KMR: మొక్కజొన్న రైతుల బకాయిలు 2025- 26 సీజన్కు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మార్క్ ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ R. శశిధర్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్లో మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రూ. 63.19 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు.