మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని జిల్లా డీపీఆర్వో శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విప్గా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో సత్కరించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళేందుకు పబ్లిక్ రిలేషన్స్ శాఖ ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందన్నారు.