KNR: శంకరపట్నం మండలం చింతలపల్లిలో ఆదివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికే గ్రామంలోని సీసీ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు రోడ్డుపై నడవడం ఇబ్బందికరంగా మారిందని వారు వాపోయారు. రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్థులు కోరుతున్నారు.