KMR: ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ‘ప్రజావాణి’ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలో మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజావాణికి అధికారులు డుమ్మా కొట్టారు. కేవలం మూడు శాఖల అధికారులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ప్రజలు తీవ్ర అసహన వ్యక్తం చేశారు.