MNCL: దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, వాహనాల పార్కింగ్ అంశాలను పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా అవసరమైన భూములను పరిశీలించి వివరాలతో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.