MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఆర్వో కుద్బుద్దిన్ మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణకై ప్రతి ఒక్కరు సహకరించాలని, అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు.