MNCL :కన్నెపల్లి మండలం జంగంపల్లికి చెందిన టకిరే నాగేశ్ (23) సోమవారం పంటలకు వాడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమార్తెతో పాటు 3నెలల శిశువు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో నాగేశ్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.