హనుమకొండ జిల్లా వెలేరు మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి సోమవారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 250 మంది గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించగా, నిపుణులైన వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.