SDPT: గంగాపూర్ మిర్చి మార్కెట్ను ఆదివారం ఏఎంసీ ఛైర్మన్ మీసం మహేందర్ తిరిగి ప్రారంభించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఈ మార్కెట్ను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. రైతులు తమ పంటను ఇక్కడే విక్రయించుకోవాలని కోరారు. మూతపడిన మార్కెట్ తెరుచుకోవడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.