HYD: కుత్బుల్లాపూర్లోని సురారం PS పరిధిలో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. మల్లారెడ్డి ఆస్పత్రి ముందు రోడ్డు పక్కన మార్బుల్ షాప్ వద్ద నలుగురు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న తల్లి ఒడిలో నుంచి, అర్ధరాత్రి ఆరు నెలల చిన్నారి ఆశను దుండగులు అపహరించారు. తల్లి నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.