KMR: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై మంత్రితో చర్చించగా, కామారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని ఛైర్పర్సన్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా ఆమె సత్కరించారు.