NRPT: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ఇవాళ పట్టణంలో పర్యటించనున్నారని మున్సిపల్ కమిషనర్ మురళి ఒక ప్రకటనలో తెలియజేశారు. మక్తల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఉదయం 11 గంటలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.