MHBD: మరిపెడ మండలంలోని బాలుర ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు అన్నారు. మరిపెడలో ముఖ్య నేతల సమావేశంలో జ్యోతిబసు మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.