SDPT: వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను నిబంధనల ప్రకారం పాటించాలని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి సూచించారు. సోమవారం గౌరారంలోని కావేరి యూనివర్సిటీలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు.