KMR: రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు ముఖ్యమని తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో 300 మందికి హెల్మెట్లు, డ్రైవర్లకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు.