HNK: వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణం, ప్లాట్ఫామ్లపై ఉన్న ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆర్.ఐ తెలిపారు. అనుమానితుల వివరాలు సేకరించి, ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.