WGL: కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న ఈ పుష్కరాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అంత్య పుష్కరాలకు రూ.30కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.198కోట్లు కేటాయించిందని తెలిపారు.