MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం, గుర్తురు, మడిపల్లి, సోమారం కుంట తండా గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే అక్రమ ఇసుక రవాణా నడుస్తుందని మండలంలోని ప్రజలు, పలువురు పలు రకాలుగా ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.