MDK: దేశ ప్రజలకు సేవలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదునపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజును కొనియాడారు. ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలన్నారు.