ADB: ఈనెల 20 నుంచి నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం గా పోటీలో అదిలాబాద్ జిల్లా ఖో ఖో జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను కలెక్టర్ రాజర్షి షా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ప్రతిభ కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ శ్యామల దేవి, అధికారులు, తదితరులు ఉన్నారు.