MNCL: ప్రభుత్వ ఆసుపత్రులకు విచ్చేస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను శనివారం సందర్శించారు. వార్డులు, మందుల నిలువలు, ఆసుపత్రి పరిసరాలు, చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.