NLG: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2025-26 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాల కోసం మీసేవా ద్వారా దరఖాస్తుల సమర్పణ, నవీకరణ కోసం తేదీని సెప్టెంబరు 12 వరకు పొడిగించినట్లు చిట్యాల ఎంఈవో సైదా నాయక్ తెలిపారు. ఆలస్య రుసుముతో ఈనెల 20వ తేదీ వరకు మీసేవ కేంద్రాల ద్వారా ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.