MDK: రేగోడ్ కేజీబీవీలో విద్యార్థుల అస్వస్థతకు బాధ్యులుగా ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు అస్వస్థకు గురైతే ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదంటూ రిపోర్టులో పేర్కొనడాన్ని తప్పుపట్టారు.