NGKL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి 9 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల ద్వారా ఎస్పి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.