BDK: ఇల్లందు నియోజక వర్గం ముత్యాలంపాడు గ్రామంలో 293 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాని సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని, నిరుపేదలకు సన్నబియ్యం, ఫ్రీ బస్సు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.