NZB: పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పలు కీలక అంశాలను లేవనెత్తారు. రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా యూరియా సరఫరాలో ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.