SRCL: జనగణన పకడ్బందీగా పూర్తి చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో చార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన ఇది అని వెల్లడించారు. కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.