KMR: బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సరిత మానేకర్ హాజరై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభం కాబోతున్నాయని, బిచ్కుంద మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని పేర్కొన్నారు.