VKB: పరిగి మండలం రాపోల్లో కావలి పద్మమ్మ నూతన ఇందిరమ్మ గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకు రాపోలు గ్రామానికి 18 ఇందిరమ్మ ఇళ్లను మంజూరయినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.