NRPT: ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామంలో పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్ల పునర్నిర్మాణం ప్రారంభించారు. సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో 25 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సహకారం, సర్పంచ్ బోయ నాగేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరహరి పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.