NRPT: నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో తై బజార్, జంతు వధశాల, పశువుల సంత, మాంస వ్యర్థాల సేకరణకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ నర్సయ్య తెలిపారు. పాల్గొనే వారు తై బజార్కు రూ.లక్ష, వధశాలకు రూ.50 వేలు, వ్యర్థాల సేకరణకు రూ.లక్ష, పశువుల సంతకు రూ.లక్ష డీడీలు కట్టాలన్నారు. అలాగే రశీదులని ఈనెల 30న మధ్యాహ్నం 12లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.