ASF: జైనూర్ మండలంలోని జెండాగూడ చెందిన సవితకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ (EMT) దత్తాత్రేయ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పైలట్ బాపూరావు సిబ్బందికి అభినందనలు తెలిపారు.