WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వార్డు వివేకానంద కాలనీలోని కాల్వలో మట్టి కూడుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మున్సిపల్ అధికారులకు తెలుపగా, స్పందించలేదని వారు ఆరోపించారు. ఈ విషయంపై ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించి JBC సహాయంతో కాలువ మరమ్మతు పనులు చేయించినట్లు కౌన్సిలర్ తెలిపారు.