WGL: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించేందుకు గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.