SDPT: హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల 78వ వర్ధంతి సభ ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. అమరవీరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. అమరవీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు.