BDK: దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. పనుల్లో అలసత్వం వహించవద్దన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి వెంట ఉన్నారు.