MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు. వార్డు కౌన్సిలర్ నీలా లచ్చిరాం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులున్నారు.