NGKL: బిజినేపల్లి మండలం మంగనూరులో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రం స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బండ్లు, బోనాల సమర్పణ చేయనున్నారు. గ్రామం నుంచి బయలుదేరే ఈ బండ్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.