MHBD: కురవి మండలం పెద్దతండలో గోవింద్ స్మారక విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గుగులోతు విజయ్- దుర్గ కుమారుడు గోవింద్ సంవత్సరం క్రితం హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఈరోజు ఆవిష్కరించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై గోవింద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.