BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పున ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజ, ఉత్సవ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ప్రత్యేక ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఈవో మహేష్ సమన్వయంతో చేపట్టారు.