RR: షాద్నగర్ పట్టణంలోని 23వ వార్డు మైసమ్మ దేవాలయంలో నూతన ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందేమోహన్, కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాయి మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సత్యనారాయణ వారికి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.