MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలో జర్నలిస్ట్ చంద్రశేఖర్పై జరిగిన భౌతిక దాడిని TRP జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ తీవ్రంగా ఖండించారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. KGBV పాఠశాల గోడ నిర్మాణంలో నాణ్యత లోపాలను ఎత్తిచూపుతూ వార్త రాసిన జర్నలిస్టుపై దాడులు అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని, కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు.