MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు డాక్టర్లు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.