KMR: ఉప్పల్వాయి – కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద వారం రోజులుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు గురువారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో మూసివేసిన రైల్వే గేట్ను అధికారులు తిరిగి వాహన రాకపోకలకు తెరిచారు. మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు గేట్ పునఃప్రారంభంతో ఊపిరిపీల్చుకున్నారు.