NZB: ఎడపల్లి మండలం సరయు ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎడపల్లికి చెందిన బాలయ్య, ఎరాజ్పల్లికి చెందిన నారాయణ ఒకరినొకరు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గంగామణి, అనిల్ వెంటనే స్పందించి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.