జగిత్యాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కోరుతూ సేవాదళ్ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్యను కలిశారు.ఈ సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సేవా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం అందజశారు.