GDWL: గత కొన్ని నెలల నుంచి అలంపూర్ మండల కేంద్రంలోని సింగవరం 1 గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరిగ్గా రాక స్థానిక గ్రామ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు స్థానిక సర్పంచ్ గోంగోల ఈశ్వర్ మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవిచంద్రను కలిసి నీటి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన సమస్యను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.