మేడ్చల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 7వ వార్డులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యగా రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలను మున్సిపల్ సిబ్బంది గంగాధర్ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి కాలనీ వాసులు అల్లాడి మహేష్, ఇతరులు కృతజ్ఞతలు తెలిపారు.