కడప: రేపటి నుంచి 20వ తేదీ వరకూ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎలిశెట్టి పవన్ గురువారం తెలిపారు. ఈ వారోత్సవాలలో భాగంగా 14న యూకేజీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు జాతీయ నాయకుల వేషధారణ పోటీలు, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.