MHBD: HYD పటాన్ చెరువు ప్రాంతంలో భార్యాభర్తలు హత్యకు గురైన ఘటనపై దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం పోయిన దంపతులు హత్యకు గురికావడం బాధాకరమన్నారు. పోలీసులు వెంటనే నిందితులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.